టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టుకు వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో మళ్లీ హీరోగా నిలిచాడు. కొలంబోలో పాకిస్తాన్తో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్లో అతడు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడుతూ మ్యాచ్ మూడ్ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినా, ఇషాన్ మాత్రం ఒత్తిడిని పట్టించుకోకుండా దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించాడు.
తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టిన ఇషాన్, కేవలం 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి పాక్ బౌలర్లను నిలువరించాడు. మొత్తం 40 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ అర్ధశతకం ద్వారా ఇషాన్ ఒక ప్రత్యేక రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
పాకిస్తాన్పై టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాటర్గా చరిత్రలో నిలిచాడు. ఈ రికార్డు ఇంతవరకు యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2012లో అహ్మదాబాద్లో పాక్పై యువరాజ్ 29 బంతుల్లో అర్ధశతకం సాధించగా, ఇప్పుడు ఇషాన్ కేవలం 27 బంతుల్లోనే ఆ ఘనతను అధిగమించి 14 ఏళ్ల రికార్డును చెరిపేశాడు.
ఇషాన్ కిషన్ ఆడిన ఈ ధాటైన ఇన్నింగ్స్ భారత్కు కీలకమైన ఆధిక్యాన్ని అందించడమే కాకుండా, పాకిస్తాన్పై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటేలా చేసింది.






