---Advertisement---

రాష్ట్రంలో క‌ల్తీ కల్లోలం

క‌ల్తీ కల్లోలం… ప్రాణాలపై ముప్పు పెరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనం?
---Advertisement---

రాష్ట్రంలో క‌ల్తీ మహమ్మారి రూపం దాల్చుతోంది. పాలు నుంచి నీళ్లు, ఆహారం నుంచి మద్యం వరకు ప్రతి దానిలో కల్తీ కలకలం రేపుతోంది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మాత్రం చలనం కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు చూస్తే పరిస్థితి ఎంత భయంకరంగా మారిందో స్పష్టమవుతోంది.

పాలు అనేది శిశువుల నుంచి వృద్ధుల వరకు అందరూ తీసుకునే ముఖ్య ఆహారం. అయితే పాలలో డిటర్జెంట్లు, యూరియా, స్టార్చ్ వంటి హానికర పదార్థాలు కలుపుతున్నారన్న ఆరోపణలు తరచుగా వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి చిన్నారులు అస్వస్థతకు గురై చ‌నిపోయిన‌ ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. లాభాల కోసం కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

తాగునీరు కూడా భద్రమేనా?
శుద్ధమైన నీరు అందించాల్సిన చోటే కల్తీ నీరు ప్రజల దాహాన్ని తీర్చుతోంది. మురికి నీరు, కాలుష్యంతో కూడిన నీరు సరఫరా అవుతుండటంతో డయేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి నాణ్యతపై సందేహాలు పెరుగుతున్నాయి. కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవించిన ఘటనలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి.

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నాణ్యత తనిఖీలు, లైసెన్సింగ్, నియంత్రణలు కఠినంగా అమలు చేయడంలో పూర్తిగా విఫ‌ల‌మైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment